జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెన్నై వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు సమాచారం. రేపు మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్తో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ కన్నెమోరాలో ప్రెస్మీట్ పెట్టనున్న పవన్ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.