రేపు చెన్నైలో పర్యటించనున్న పవన్.. కీలక ప్రకటన చేసే అవకాశం

Update: 2018-11-20 07:17 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెన్నై  వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు సమాచారం. రేపు మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హోటల్‌ కన్నెమోరాలో ప్రెస్‌మీట్‌ పెట్టనున్న పవన్‌  కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. 
 

Similar News