వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయ్. విశాఖ జిల్లాకు చెందిన రాజశేఖర్కు రాణి అనే యువతితో వివాహామైంది. వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలోనే రాజశేఖర్ అశ్వినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్. చనిపోయే ముందు కారణాలను సెల్పీ వీడియోలో వివరించాడు.