2007 ఆగస్టు 25 హైదరాబాద్ జంటపేలుళ్ల కేసులో తీర్పు వెలువడింది. ఇప్పటికే ముగ్గురిని దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం శిక్షలు ఖరారు చేయనుంది. అనీక్ షఫీక్, 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఇటీవల తీర్పు వెలువరించింది సయాద్, ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ1 గా ఉన్న అనీక్ షఫీక్, ఏ2 గా ఇస్మాయిల్ లకు ఉరిశిక్ష విధించింది. నిందితులకు ఆశ్రయం కల్పించిన మరో నిందితుడు తారిఖ్ అంజుమ్కు జీవితఖైదు విధిస్తూ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రియాజ్ భత్కల్, ఇక్భాల్ భత్కల్, అమీర్ రెజాఖాన్లు పరారీలో ఉన్నారు.
కాగా 2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో తొలుత లుంబిని పార్క్లో , ఆ తర్వాత గోకుల్ చాట్లో జంటపేలుళ్లు చోటు చేసుకొన్నాయి.ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, 65 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. దాంతో పదకొండేళ్ళుగా విచారణ జరుగుతూనే వచ్చింది. తాజాగా ఇద్దరు నిందితులకు ఉరి శిక్ష ఖరారు చేయడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది.