మంత్రి కాలువ ఇంటి వద్ద ఉద్రిక్తత

Update: 2018-10-15 07:02 GMT

అనంతపురంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు ఇంటిని మున్సిపల్ కార్మికులు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్ది కాలంగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మహిళా కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చెలరేగింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడ్డారు. 

Similar News