అనంతపురం ఎస్బీఐలో భారీ చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో లాకర్ను కట్ చేసిన ఇద్దరు దొంగలు 41లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. బ్యాంకులో మొత్తం 26 సీసీ కెమెరాలు ఉండగా, 10 సీసీ కెమెరాలను పగులకొట్టారు. అయితే మిగతా కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.