కేబినెట్ సమావేశానికి మంత్రి గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టారు. భీమిలిలో ఈ సారి ఓడిపోవడం ఖాయమంటూ వార్తలు వస్తుండటంతో కినుక వహించిన గంటా విశాఖలో ఇంటికే పరిమితమయ్యారు. జ్వరం కారణంగానే ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సీఎంకు కూడా ముందుగానే సమాచారం అందించినట్టు పేర్కొంటున్నారు.