రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.649కే..

Update: 2018-07-17 13:36 GMT

ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్-అమెజాన్‌లు వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ బిగ్ డీల్ తో దుమ్మురేపగా.. మరో దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇదే తరహా ఆఫర్ ను ఈ నెల 19 వరకు కొనసాగించనుంది. ఇందులో భాగంగా షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.649కే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అయితే ఈ ఫోన్ కావాలనుకునేవారు... ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌చేంజ్‌లో రూ.12,850 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో పదిశాతం రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఫోన్‌ రూ.649కే లభించనుంది. 

Similar News