పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసిన ప్రముఖ నటుడు

Update: 2018-09-18 10:00 GMT

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్‌ వెంక‌ట్.. వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి సంఘీభావం తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 265వ రోజు మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మార్గ‌మ‌ధ్య‌లో వెంక‌ట్ వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి మ‌ద్ద‌తు తెలిపారు.. ఈ సందర్భంగా జగన్‌తో కలిసి కొంత దూరం నడిచారు. కాగా.. సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు జ‌గ‌న్‌ను క‌లిసి ఇదివ‌ర‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

Similar News