ఉత్తర్ప్రదేశ్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయ్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కాస్మాండ హౌస్ వద్ద మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ తనయుడు వైభవ్ తివారిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 36 వయస్సున్న వైభవ్ తివారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదే హత్యకు దారి తీసి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ హాల్కు సమీపంలోనే ఘటన జరగడంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు.