నాలుగు రోజులుగా లారీల సమ్మె కొనసాగుతోంది.నిన్నటిదాకా అత్యవసర సరుకులు, పెట్రోలు, డీజిల్, మందులు, ఇతర నిత్యావసర సరుకుల రవాణాకు మినహాయింపు ఇవ్వగా.. సమ్మెపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ క్రమంలో మంగళవారం నుంచి అత్యవసర సరుకుల రవాణాను కూడా నిలిపేసే విధంగా లారీల యజమానులు చర్చలు జరుపుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తెలుగురాష్ట్రాల లారీల యాజమాన్యం జెఏసి భేటీ అయింది. ఏ క్షణానైనా ఈ నిర్ణయం ప్రకటించే అవకాశమున్నందున ప్రభత్వ పెద్దలు దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కాగారెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5 లక్షలకు పైగా లారీలున్నాయి. లారీల సమ్మె కారణంగా ప్రభుత్వానికి రోజుకు రూ.25 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు అంచన.