మృత దేహాలకు తప్పని తిప్పలు

Update: 2018-08-25 09:02 GMT

తూర్పుగోదావరి జిల్లాలో వరద  కష్టాలు లంక గ్రామాల ప్రజలకు, పశువులకే కాదు మృత దేహాలకు తిప్పలు తప్పడం లేదు...వరదతాకిడికి అయినవిల్ల మండలం ముక్తేశ్వరం వృద్ధగౌతమీ స్మశాన వాటిక గోదావరిలో మునిగిపోయింది.  చనిపోయిన వారి మృతదేహాలను దహనం చేసేందుకు స్మశానవాటికలో స్థలం లేకపోవడంతో రోడ్డుపైనే దహన సంస్కరణలు చేస్తున్నారు. వరదలు వచ్చిన సమయంలో దహన సంస్కరణలు చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు. 

Similar News