కర్నూలు జిల్లాలో కీచకపర్వం...ఒంటరి మహిళపై ఇద్దరు పోలీసుల అత్యాచార యత్నం

Update: 2018-07-02 05:21 GMT

కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు. 
కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఓ మహిళ కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తోంది. మద్యం మత్తులో ఓ ఆకతాయితో కలిసి నాగరాజు, శివరామ్ అనే కానిస్టేబుళ్లు కూల్ డ్రింక్ షాప్ వద్దకు వచ్చారు. ఒంటరిగానున్న మహిళతో అసభ్యంగా మాట్లాడారు. డబ్బులు చేతుల్లో పెట్టి అత్యాచార యత్నం చేశారు. ఆ మహిళ ప్రతిఘటించడంతో..ఆకతాయితో సహా ఇద్దరు పోలీసుల జారుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసు ఉన్నాతాధికారులు కానిస్టేబుళ్ల నిర్వాకంపై విచారణ జరిపించారు. కీచక కానిస్టేబుళ్లు నాగరాజు, శివరామ్‌లతో పాటు హాజీవలి అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 

 

Similar News