కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రకటించారు. విపక్ష పార్టీలన్నింటికీ వైసీపీ లేఖలు రాయడంతో కాంగ్రెస్తోపాటు 20 పార్టీలు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది.