కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను పార్టీ ఖరారు చేసింది. కొద్దిరోజుల క్రితం 65 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ 10 మందితో రెండో జాబితా విడుదల చేసింది. వివాదాలు, అసంతృప్తులు లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 65 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మరో పది మందితో రెండో జాబితాను విడుదల చేసింది.
నియోజకవర్గ స్థానాల వారీగా చూస్తే ... మేడ్చల్- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ఖానాపూర్- రమేష్ రాథోడ్, ఖైరతాబాద్- దాసోజు శ్రవణ్, సిరిసిల్ల- కెకె. మహేందర్రెడ్డి, జూబ్లీహిల్స్- విష్ణువర్దన్రెడ్డి, పాలేరు- ఉపేందర్రెడ్డి, ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్కుమార్, షాద్నగర్- సి. ప్రతాప్రెడ్డి, భూపాలపల్లి- గండ్ర వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి- జాజాల సురేందర్లకు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, రెండో జాబితాలోనూ ప్రముఖుల పేర్లు కనిపించలేదు. కాంగ్రెస్ ఇవాళ విడుదల చేసిన రెండో జాబితాలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, రెండు బీసీ రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థులకు సీట్లు ఖారారు చేయగా, ఆరు స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.