కవితను మళ్లీ గెలిపిస్తే రాజకీయ సన్యాసం..

Update: 2018-07-06 10:09 GMT

నిజామాబాద్ ఎంపీగా కవితను మళ్లీ గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కేటీఆర్ చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీలలో 40శాతం వాటా కేసీఆర్ కుటుంబసభ్యులదేనని కోమటిరెడ్డి ఆరోపించారు. సాధారణ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాలు చేస్తున్నారని, ఆమె చెల్లెను గెలిపించుకుంటే తాను రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

Similar News