నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉఫ్లూర్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా కమ్మర్పల్లి మండలకేంద్రానికి చెందిన మణి(14) అనే బాలుడు బాల రాజేశ్వర ఆలయానికి వెళ్లాడు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తుండగా భారీ వృక్షం బాలుడిపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.