ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష ప్రారంభం

Update: 2018-06-20 07:15 GMT

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం ఉదయం జడ్పీ కార్యాలయం ఆవరణలో రమేష్ దీక్షను ప్రారంభించారు. ఎంపీ సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఆమరణదీక్షకు దిగారు. ముందుగా గాంధీ, ఎన్టీఆర్‌ విగ్రహాలకు సీఎం రమేష్‌ పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. సీఎం రమేష్ దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. అంతకుముందు పోట్లదుర్తి నుంచి భారీ ర్యాలీతో కడప దీక్షా శిబిరానికి సీఎం రమేష్‌ చేరుకున్నారు.
 

Similar News