'రంగ‌స్థ‌లం' షూటింగ్ స్పాట్‌లో చిరు, రాజ‌మౌళి

Update: 2017-09-20 09:32 GMT

'ధృవ' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం 'రంగ‌స్థ‌లం'. 1985 అనేది దీనికి ఉప‌శీర్షిక‌. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ‌, ఆది పినిశెట్టి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్‌లో జ‌రుగుతోంది.

మంగ‌ళ వారం ఆ చిత్రం షూటింగ్ స్పాట్ లో  మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి సంద‌డి చేశారు. చిత్ర‌బృందంతో కాసేపు స‌ర‌దాగా గ‌డిపారు. ఆ సంద‌ర్భంగా దిగిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, 1985 నాటి ప‌రిస్థితులను ప్ర‌తిబింబిస్తూ 'రంగ‌స్థ‌లం' కోసం రూ.5 కోట్ల భారీ వ్య‌యంతో సెట్టింగ్‌ని నిర్మించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నారు.

Similar News