మంత్రి గంటా వైసీపీలో చేరిక గురించి మా ఎంపీ చెప్పారు : బొత్స

Update: 2018-06-20 11:16 GMT

గతకొద్ది రోజులుగా టీడీపీలో మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.నిన్న(మంగళవారం) కేబినెట్‌ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. రేపు విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా... ఆ ఏర్పాట్లను కూడా పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి మంత్రి ఇంటికే పరిమితం అవడం... పార్టీ శ్రేణులను ఆందోళనలో పడేస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు త్వరలో పార్టీ మారుతారని రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.. అదికూడా ప్రతిపక్ష వైసీపీలో ఆయన చేరిక ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ(బుధవారం) వైసీపీ నేత బొత్స మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గంటా వైసీపీలో చేరుతున్నారన్న  వార్తలపై అయన మాట్లాడారు. తమ పార్టీలో ఎవరు చేరాలన్న పదవులకు రాజీనామా చెయ్యాలని అన్నారు.. అలాగే ఈ విషయంపై తమ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలోనే చెప్పారు. కానీ గంటా శ్రీనివాసరావు చేరుతున్నట్టు సమాచారం లేదని అన్నారు.  

Similar News