బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి..

Update: 2018-09-22 02:21 GMT

రాజమహేంద్రవరం బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి. ఈ ప్రమందంలో ఇద్దరు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సిటీలోని ఆసుపత్రికి తరలించారు. లాలాచెరువు సుబ్బారావు నగర్‌ లోని ఓ ఇంట్లో దీపావళి కోసం బాణాసంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. తీవ్ర గాయాలైన సూర్యకాంతం, ధనలక్ష్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ప్రమాదంలో కుటుంబసభ్యులు ఇద్దరు మృతిచెంది నలుగురు గాయపడటంతో ఆ ఇంట విషాదం నెలకొంది. సమాచారమునందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాదం కాదని షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగివుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News