ఆడపిల్ల పుట్టిందనే పాపానికి అత్తింటివారు కోడల్ని కొట్టి తరిమేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని మనసానికుంట గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గురజాల పద్మకు సత్యనారాయణతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఏడాది క్రితం పద్మకు పాప పుట్టడంతో ఆడపిల్లతో గుమ్మం తొక్కొద్దని అత్తింటివారు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. పసిబిడ్డతో పద్మ మెట్టినింటి ముందు ధర్నా నిర్వహించింది. ఆమెకి పలు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. ఇంటి తాళ్ళం పగలకొట్టి పద్మని లోనికి పంపారు.