కేసీఆర్‌కు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు: ఏపీ మంత్రి

Update: 2018-10-04 09:03 GMT

చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే కేసీఆర్‌కు నష్టమే తప్ప లాభం ఉండదన్నారు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. మోడీ నుంచి కేసీఆర్ వరకూ చంద్రబాబును చూసి భయపడుతున్నారన్నారు. ఆంధ్రావాళ్లను దూషిస్తేనే ఓట్లు పడతాయని అనుకోవడం మంచిదికాదని హితవు పలికారు. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావని ఆయన ప్రశ్నించారు. సైబరాబాద్‌ సృష్టికర్త చంద్రబాబు అని తెలంగాణను నాశనం చేశారనడం బాధాకరమన్నారు. 500 కోట్లు కాదు 5 కోట్లు కూడా తెలంగాణకు పంపాల్సిన కర్మ పట్టలేదన్న ఆయన కేసీఆర్‌కు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు మంత్రి సోమిరెడ్డి. 
 

Similar News