ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఫలితాలను ప్రకటించారు. మొత్తం 73.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. 84శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలవగా 54శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా లాస్ట్ ప్లేస్లో నిలిచింది. 77శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో 76శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.
ఎంపీసీ ఫస్ట్ ర్యాంక్ - తేజవర్దన్రెడ్డి (992)
ఎంపీసీ సెకండ్ ర్యాంక్ - షేక్ ఆఫ్రాన్ (991)
ఎంపీసీ థర్డ్ ర్యాంక్ - సుష్మా (990)
బైపీసీ ఫస్ట్ ర్యాంక్ - దీక్షిత (990)
బైపీసీ సెకండ్ ర్యాంక్ - లక్ష్మీకీర్తి (990)
బైపీసీ థర్డ్ ర్యాంక్ - షిన్యత (990)