Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా కాటేసిన కాలం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి!

Road Accident: దైవ దర్శనానికి వెళ్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది.

Update: 2026-03-04 06:22 GMT

Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా కాటేసిన కాలం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి!

Road Accident: దైవ దర్శనానికి వెళ్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని రాజాజీనగర్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు కారులో తిరుమల శ్రీవారి దర్శనం కోసం బయలుదేరారు. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్‌ వద్దకు చేరుకోగానే, వీరి కారు ముందు వెళ్తున్న లారీని అతివేగంతో బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో, లోపల ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే మరణించారు.

మృతుల వివరాలు

మృతులను బెంగళూరు వాసులుగా గుర్తించారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి:

మోహన్‌దాస్‌ (71)

నాగరాజారావు (61)

కుసుమ (61)

జయంతి (59)

పూజ (33)

సమాచారం అందుకున్న గంగవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీఐ రామ్‌భూపాల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బెంగళూరులోని వారి నివాస ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Tags:    

Similar News