తమ్ముడు గురించి సంచలన విషయం చెప్పిన అమృత

Update: 2018-09-17 03:41 GMT

కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో అల్లుడైన ప్రణయ్ ని అతి కిరాతకంగా కిరాయి గుండాలతో హత్య చేయించాడు మిర్యాలగూడకు చెందిన వ్యాపారి మారుతీరావు. ప్రస్తుతం ఆ హత్యలో పాలుపంచుకున్న నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.తన భర్తను చంపించిన తండ్రి, బాబాయ్ ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది అమృత. ఇక అమృత బాబాయ్ అయన భార్య, కొడుకు గురించి విస్తుపోయే విషయం చెప్పుకొచ్చింది. బాబాయ్ కొడుకు ఎన్నోసార్లు తనను అసభ్యంగా వేధించడానికి.. వాడు ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే పోర్న్ చూడటం  మొదలు పెట్టాడు. ఈ విషయం వాళ్ళమ్మకు చెబితే మగపిల్లలు అలాగే ఉంటారని చెప్పింది. అంతేకాదు తనతో అసబ్యంగా ప్రవర్తించాడని వాడి గురించి బాబాయ్ కి చెబితే నన్నే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడని చెప్పుకొచ్చింది. తాను చేసింది తప్పుగా భావించే బాబాయ్.. ఆయన వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం తప్పుకాదా అని ప్రశ్నించింది. 

Similar News