వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి సెగలు ఎగిసి పడ్డాయి. వరంగల్ పశ్చిమ టికెట్ నాయిని రాజేందర్ రెడ్డికి ఇవ్వాలంటూ అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని పార్టీ కార్యాలయంగేటుకు తాళాలు వేసి దీక్షకు దిగారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్తో పాటు ఇతర కార్యకర్తలు ఆందోళన దిగారు. రాజేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ కార్యకర్తలు హెచ్చరించారు. తమ నేతకు టికెట్ ఇవ్వకపోతే పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ స్ధానిక ప్రజాప్రతినిధుల వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన సీనియర్ నేతలు బుజ్జగించే పనిల్లో పడ్డారు.