బియ్యం లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన జనగామలో జరిగింది. జనగామ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి 2 గంటల సమయంలో బియ్యం లోడ్ చేసుకుని సికింద్రాబాద్ వెళుతున్న గూడ్స్.. వ్యాగన్ పాయింట్ లైన్పై పట్టాలు తప్పింది. దీంతో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 17 బోగీలు పట్టాలు తప్పడంతో హుటాహుటిన సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నతాధికారులు జనగామకు చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను వదిలేసి మిగతా బోగీలను సికింద్రాబాద్కు పంపించేశారు. ప్రస్తుతం మిగిలిన పట్టాలను యధాస్థితికి తెచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.