దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డుల బాట..

Update: 2020-12-14 06:18 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులతో లాభాల బాటన సాగుతున్నాయి. గతవారంలో సరికొత్త రికార్డులతో దూకుడుగా సాగిన దేశీ స్టాక్ సూచీలు. తాజా వారంలోనూ అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్‌ 210 పాయింట్లు ఎగసి 46,309 వద్దకు చేరగా, నిఫ్టీ సైతం 65 పాయింట్ల మేర లాభంతో 13,579 వద్ద కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు దేశీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News