RBI: RTGS, NEFT, UPIల కథ క్లోజ్.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈజీగా మనీ ట్రాన్సఫర్.. అందుబాటులోకి కొత్త పేమెంట్ సిస్టం..!

Light Weight Portable Payment System: లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పని చేస్తోంది.

Update: 2023-06-01 02:30 GMT

Light Weight Portable Payment System: లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం లాంటి పరిస్థితులలో కీలక లావాదేవీల కోసం ఈ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. RBI ప్రకారం, ప్రతిపాదిత లైట్ వెయిట్ పోర్టబుల్ పేమెంట్ సిస్టమ్ (LPSS) సాంప్రదాయ సాంకేతికతతో సంబంధం లేకుండా పనిచేస్తుంది. కొంతమంది ప్రత్యేక ఉద్యోగులు ఈ వ్యవస్థను ఎక్కడైనా ఆపరేట్ చేయవచ్చు.

ఇప్పటి వరకు అంతా ITపై ఆధారపడి పని చేస్తాయి..

చెల్లింపుల లావాదేవీల కోసం ప్రస్తుతం అమలవుతున్న RTGS, NEFT, UPI వంటి సేవలు పెద్ద మొత్తంలో చెల్లింపులను నిర్వహించడానికి రూపొందించినవి. ఈ చెల్లింపు వ్యవస్థలు అధునాతన IT మౌలిక సదుపాయాలపై పని చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం సంభవించినప్పుడు అంతర్లీన సమాచారం, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలకు అంతరాయం కలిగితే ఇవి పనిచేయవు. దీంతో చెల్లింపులు జరగవు. ఇలాంటి సమయంలో ఈ కొత్త చెల్లింపు వ్యవస్థలను అందుబాటులో ఉంచవచ్చని RBI తెలిపింది.

ఉద్యోగులు ఎక్కడి నుండైనా ఆపరేట్ చేసే ఛాన్స్..

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉపయోగించగలిగే ఇటువంటి వ్యవస్థను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, RBI LPSSని ప్లాన్ చేసింది. ఇది సాంప్రదాయ సాంకేతికత నుంచి స్వతంత్రంగా ఉంటుంది. తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఎక్కడి నుంచైనా ఈ సేవలను ఆపరేట్ చేయవచ్చు.

ఇది కనీస హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌పై పని చేస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. అవసరమైనప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ప్రభుత్వం, మార్కెట్ సంబంధిత లావాదేవీల వంటి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ముఖ్యమైన లావాదేవీలను పూర్తి చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Tags:    

Similar News