PMJJBY: రూ.2 లక్షల బీమా కేవలం రూ.436లకే.. ఈ స్కీంలో చేరితే బోలెడు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు మీకోసం..!

PMJJBY: దేశంలోని పౌరుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. దేశంలోని సాధారణ పౌరుల కోసం ఓ అద్భుతమైన పథకం ఒకటి ఉంది.

Update: 2023-05-11 14:30 GMT

PMJJBY: రూ.2 లక్షల బీమా కేవలం రూ.436లకే.. ఈ స్కీంలో చేరితే బోలెడు ప్రయోజనాలు.. పూర్తి వివరాలు మీకోసం..!

PMJJBY: దేశంలోని పౌరుల ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. దేశంలోని సాధారణ పౌరుల కోసం ఓ అద్భుతమైన పథకం ఒకటి ఉంది. అదే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PM Jeevan Jyoti Bima Yojana). దేశంలోని ప్రతి విభాగం ఈ బీమా పథకం ద్వారా ప్రయోజనాలను పొందుతుంది. ఈ బీమా పథకం కింద, పాలసీని కొనుగోలు చేయడానికి సంవత్సరానికి ఒకసారి చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించాలి. జీవన్ జ్యోతి బీమా యోజనను ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. దేశంలోని పౌరులు ప్రతి సంవత్సరం డబ్బులు చెల్లించి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు.

రూ. 2 లక్షల బీమా..

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద, పాలసీ తీసుకునే వ్యక్తి ఏదైనా కారణం వల్ల మరణిస్తే, నామినీకి రెండు లక్షల రూపాయల వరకు బీమా లభిస్తుంది. జీవన్ జ్యోతి బీమా పాలసీని 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు కొనుగోలు చేయవచ్చు. జీవన్ జ్యోతి బీమా పాలసీ మెచ్యూరిటీ వయస్సు 55 సంవత్సరాలు. ఈ టర్మ్ ప్లాన్‌ను ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి.

ఏ సంవత్సరంలోనైనా ప్రీమియం డిపాజిట్ చేయకపోతే, బీమా ప్రయోజనం అందుబాటులో ఉండదు. కానీ, ఒక సదుపాయం ఏమిటంటే, మీకు కావలసినప్పుడు, మీరు 55 సంవత్సరాల వయస్సు వరకు ఈ పథకంలో ప్రవేశించవచ్చు.

ప్రతీ ఏటా రెన్యూవల్ చేయాలి..

జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీని కొనుగోలు చేసేందుకు ప్రతి సంవత్సరం రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. 2022 సంవత్సరానికి ముందు, పాలసీని కొనుగోలు చేయడానికి కేవలం రూ.330 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం రూ.436కు పెంచింది. ఈ బీమా ప్రీమియం జూన్ 1 నుంచి మే 30 వరకు చెల్లుబాటు అవుతుంది. మంచి విషయం ఏమిటంటే ఈ పాలసీ తీసుకోవడం చాలా సులభం. మీరు ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా లేదా మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో కూర్చొని ఈ పాలసీని తీసుకోవచ్చు.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్..

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది మోడీ ప్రభుత్వం టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. టర్మ్ ప్లాన్ అంటే బీమా పాలసీ సమయంలో పాలసీదారు మరణించిన సందర్భంలో మాత్రమే బీమా కంపెనీ బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. జీవన్ జ్యోతి బీమా యోజన పూర్తయిన తర్వాత కూడా పాలసీదారు జీవించే ఉంటే, అతనికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.

గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో..

జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఇప్పటివరకు 16.19 కోట్ల ఖాతాలు తీసుకున్నారు. అదే సమయంలో, ఈ పథకం కింద రూ.13,290.40 కోట్ల క్లెయిమ్ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకం లబ్ధిదారుల గురించి చెప్పాలంటే, 52 శాతం మంది మహిళలు లబ్ధిదారులు. గ్రామీణ ప్రాంతాల నుంచి మొత్తం 72 శాతం మంది ఈ పథకం కింద బీమా పాలసీలను కొనుగోలు చేశారు.

ఆధార్-పాన్ అవసరం..

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) దేశంలోని ప్రతి వ్యక్తికి జీవిత బీమా ప్రయోజనాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 9 మే 2015న ప్రారంభించింది. జీవన్ జ్యోతి బీమా యోజన కింద పాలసీ తీసుకోవడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్ అవసరం.

Tags:    

Similar News