బాబే ఉండుంటే..బోటు వెలికితీతా తన ఘనతే అనేవారు!

Update: 2019-10-27 12:22 GMT

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం టీమ్ నది నుంచి వెలికితీసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. గోదావరి నది నుంచి బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం నైపుణ్యానికి, ఆయన శ్రమకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ట్వీట్ చేశారు. ఇదే ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ఆ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేవారని విజయసాయి విమర్శించారు. చంద్రబాబే దగ్గరుండి బోటును వెలికితీయించారని ప్రచారం చేసుకునే వారని దుయ్యబట్టారు. ధర్మాడి సత్యం పేరు ఎవ్వరికీ తెలిసేది కాదన్నారు. తానే డైవర్లకు గైడెన్స్ ఇచ్చి గొలుసులు వేసి పడవను బయటకు లాగాడని కుల మీడియా బాకాలూదేదంటూ ఘాటు విమర్శలు చేశారు.

Full View

Tags:    

Similar News