చంద్రబాబు కియాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: ఎంపీ గోరంట్ల మాధవ్‌

ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు కియాపై కుట్ర పన్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు.

Update: 2020-02-09 07:27 GMT

ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే చంద్రబాబు కియాపై కుట్ర పన్నారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆరోపించారు. పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని.. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రయత్నించారని.. ఈ విషయంలో పార్లమెంట్‌ను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అసత్యాన్ని పదే పదే చెబుతూ... ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రాజధానులు వద్దంటూ... అమరావతికి అన్యాయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.


Tags:    

Similar News