ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. 2017లోనే పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంలో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి కోర్టుకు వెళ్లారు. కేసు విచారణ త్వరగా చేపట్టాలంటూ ఎర్లీ హియరింగ్ పిటిషన్ దాఖలు చేశారు.