Rajanagaram: దొంగల ముఠా హల్చల్.. వారం వ్యవధిలో రెండోసారి
Rajanagaram: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వగ్రామం గాదరాడలో భారీ దొంగతనం జరిగింది.
Rajanagaram: దొంగల ముఠా హల్చల్.. వారం వ్యవధిలో రెండోసారి
Rajanagaram: రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్వగ్రామం గాదరాడ లో అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగల ముఠా. వారం దిరిగేలోపే రెండు దొంగతనాలకు పాల్పడిన కేటుగాళ్లు. 13 లక్షలు విలువైన 10 కాసుల బంగారు ఆభరణాలు,30 వేలు నగదు దోచుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు.
వ్యవసాయ పంటల్లో వచ్చిన డబ్బులతో కొనుక్కున్న 6.50 కాసులు హారం ..3 కాసులు తాడు పట్టుకెళ్లిపోయారని బాధితురాలు భవాని వెల్లడి. వేసవి కాలం కావడంతో ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో వెనుక డోర్ పగులగొట్టి దోచుకెళ్లిన దుండగులు. బాధితురాలు చీర్ల భవాని పిర్యాదు తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
రంగం లోకి దిగిన పోలీసులు ఫింగర్ ప్రింట్ సేకరిస్తున్న క్లూస్ టీమ్. గత వారం రోజుల క్రితం అదే గ్రామంలో ఒక ఇంట్లో చొరబడి ,నిద్రిస్తున్న వ్యక్తి పై దాడికి దిగి దోపిడీకి పాల్పడిన కేటుగాళ్లు. కుటుంబ సభ్యులు అప్రమత్తం కావడంతో చేతిలో ఉన్న చాకును పడేసి పరారైన దుండగులు. వారం రోజులుగా రెండోసారి దొంగతనం జరగడంతో భయంతో వణికిపోతున్న గాదరడ గ్రామస్తులు.