ఏపీలో పరిస్థితులపై చర్చ లేవనెత్తుతాం :గల్లా

పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన

Update: 2019-11-17 11:43 GMT
galla jayadev

పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులతో పాటు రాష్ట్రానికి సంబంధించినసమస్యలపైనా చర్చ జరపాలని అఖిలపక్ష సమావేశంలో కోరినట్టు చెప్పారు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి చెందిన చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. దేశ ఆర్థికపరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని.. కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించామని గల్లా జయదేవ్‌ చెప్పారు. 

Tags:    

Similar News