CM Jagan: రైతన్నలకు అండగా ఉంటున్నాం.. రైతు నష్టపోకూడదనేది మా ప్రభుత్వ లక్ష్యం
CM Jagan: రైతులకు సమయానికి సహాయం అందిస్తున్నాం
CM Jagan: రైతన్నలకు అండగా ఉంటున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రైతు నష్టపోకూడదనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో రంగుమారిన ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ఏ పంటనష్టం జరిగినా పారదర్శకంగా పరిహారం ఇస్తున్నామని తెలిపారు. రైతులకు సమయానికి సహాయం అందిస్తున్నామన్నారు. ఏ సీజన్లో జరిగిన పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తున్నామన్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని జగన్ అన్నారు. 2023లో వర్షాభావం, గత ఏడాది డిసెంబర్లో మిచాంగ్ తుపానుతో నష్టపోయిన 11లక్షల 59వేల 126 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేశారు. 1,294వేల 58లక్షల ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేశారు.