Polavaram Project: పోలవరం–నల్లమలసాగర్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Polavaram Project: పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీమ్కు మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు.
Polavaram Projectపోలవరం–నల్లమలసాగర్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ
Polavaram Project: నేడు సుప్రీంకోర్టులో పోలవరం-నల్లమలసాగర్పై విచారణ జరగనుంది. ధర్మాసనంలో బలమైన వాదనలు వినిపించాలని లీగల్ టీమ్కు మంత్రి నిమ్మల రామానాయుడు సూచనలు చేశారు. కేసుకు సంబంధించిన రికార్డులను లీగల్ టీమ్కు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను అదేశించారు. ఏటా వృధాగా 3 వేల TMCల వరద నీరు సముద్రంలో కలుస్తుందని.. అందులో 200 TMCల నీటిని మాత్రమే తీసుకునేలా ప్రాజెక్ట్ను ప్రతిపాదించామన్నారు. గోదావరి జలవివాదాల ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం.. మిగిలిన నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందన్నారు. కేంద్రానికి ప్రాజెక్ట్ ప్రీ ఫిజిబులిటీ రిపోర్ట్ సమర్పించామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.