పుట్టపర్తి: మండల పరిధిలోని పెడబల్లి చిన్న తండాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని తండావాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా గ్రామాలలో పర్యటించిన అధికారులు ఈవో ఆర్ డి మురళీకృష్ణ, సెక్రటరీలు జితేంద్ర నాయక్, జైపాల్ రెడ్డి లను తమ తండాలోని తాగునీటి సమస్యను పరిష్కరించాలని తండావాసులు కోరారు.