Chebrolu: ఘనంగా ప్రారంభమైన విజ్ఞాన్ సృజనాంకుర
మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్ సృజనాంకుర–2020 కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్ సృజనాంకుర–2020 కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా టీసీఎస్ కంపెనీ రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ గ్లోబల్ హెడ్ ఈఎస్ చక్రవర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పచుకొని దాన్ని చేరుకునేవరకు నిరంతరం శ్రమిస్తే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను విజ్ఞాన్ చైర్మన్ లావు రత్తయ్యతో కలిసి వీక్షించారు.