ఆయన పరిస్థితి ఏంటి?

Update: 2019-03-17 02:42 GMT

ప్రజారాజ్యం పార్టీ మాజీ ఎమ్మెల్యే వంగా గీత శనివారం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.. ఆమెకు కాకినాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  దవులూరి దొరబాబు, బి.అశోక్‌ అభ్యర్థిత్వాన్ని కూడా జగన్ పరిశీలిస్తున్నారు. ఆమెకు తూర్పు గోదావరిజిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. అయితే దవులూరి దొరబాబుకు పెద్దాపురం ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పిన జగన్ అక్కడ తోట వాణికి సీటు ఖరారు చేశారు.

ఈ క్రమంలో దొరబాబుకు కాకినాడ ఎంపీ టిక్కెట్ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వంగా గీతకు కాకినాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్న క్రమంలో దొరబాబు పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 

Similar News