విషాదం: వర్షాలకు గోడ కూలి ఇద్దరి మృతి

Update: 2019-10-23 10:09 GMT

ఏపీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉంగుటూరు మండలంలో విషాదం నెలకొంది. నారాయణపురంలో వర్షానికి బాగా తడిసిన ఇంటిగోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు సిరవరపు శ్రీను (40) పెద్దిరెడ్డి రాఘవమ్మా (60)గా గుర్తించారు. దీంతో విషాదచా‍యలు అలుముకున్నాయి.

Tags:    

Similar News