తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, కర్నాటక సీఎంలు

Update: 2020-09-24 04:41 GMT

తిరుమల వెంటకేశ్వరున్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప దర్శించుకున్నారు. గురువారం ఉదయం మహద్వారం గుండా ఇరువురు ముఖ్యమంత్రులు ఆలయ ప్రవేశం చేశారు. ముందుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న జగన్‌ మహాద్వారం వద్ద యడియూరప్పకు స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఇరు రాష్ట్రాల సీఎంలకు ఆశీర్వచనం పలికారు. యడియూరప్పకు జగన్‌ శ్రీవారి శేషవస్త్రం బహుకరించారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇద్దరు ముఖ్యమంత్రులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.

Tags:    

Similar News