ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్రెడ్డిలతో కూడిన బృందం సీఎం జగన్ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. హుద్హుద్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చింది. ఈ ఇళ్లను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని నిర్మాతల బృందం కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.