మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం

మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకుల అత్యాచారం

Update: 2019-10-05 04:37 GMT

మతిస్థిమితం లేని ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కణేకల్లు మండలానికి చెందిన ఓ మహిళకు మతిస్థిమితం లేదు. కొన్నేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులు మరణించారు. అయితే స్థానికులు ఓ వ్యక్తితో వివాహం జరిపించగా మతిస్థిమితం లేని మహిళ కావడంతో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు భర్త. దీంతో అప్పటి నుంచి గ్రామంలోని ఓ ఇంట్లో పాచి పని చేస్తూ జీవనం సాగిస్తోంది.

ఆ మహిళపై కన్నేసిన ముగ్గురు యువకులు ఆమెపై నెలల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆమె శరీరంలో మార్పులను గమనించిన స్థానికులు ఆరాతీయగా అత్యాచారం విషయం బయటపడింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణీ. ఆ ముగ్గురు యువకుల గురించి తెలియడంతో పెద్దమనుషులు పంచాయితీ పెట్టి డబ్బు ముట్టజెప్పించాలనుకున్నారు.. అబార్షన్ చెయించాలని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో ప్రమాదమని వైద్యులు చెప్పడంతో ఆమెను అంగనవాడి కేంద్రంలో ఉంచి పౌష్టికాహారం అందిస్తున్నారు.  

Tags:    

Similar News