SP Dheeraj: కులవర్ధన్‌ను రక్షక్‌ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకున్నాడు

SP Dheeraj: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై అమానుషంగా హత్యాచారానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ ఉదంతం విషాదాంతమైంది.

Update: 2026-02-18 09:42 GMT

SP Dheeraj: కులవర్ధన్‌ను రక్షక్‌ వాహనంలో తరలిస్తుండగా తప్పించుకున్నాడు

SP Dheeraj: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చిన్నారిపై అమానుషంగా హత్యాచారానికి పాల్పడిన నిందితుడు కులవర్ధన్ ఉదంతం విషాదాంతమైంది. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న నిందితుడు బుధవారం ఉదయం చెరువులో శవమై కనిపించాడు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

పోలీసుల కళ్లు గప్పి పరారీ

మంగళవారం నిందితుడు కులవర్ధన్‌ను విచారణ నిమిత్తం రక్షక్ వాహనంలో తరలిస్తుండగా, అతడు పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మదనపల్లె సమీపంలోని కనసానివారిపల్లె చెరువులో ఒక మృతదేహం తేలుతూ కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అది కులవర్ధన్ మృతదేహంగా గుర్తించారు.

ఆత్మహత్యగా ప్రాథమిక నిర్ధారణ

పోలీసులకు దొరికితే శిక్ష తప్పదనే భయంతోనో లేదా పశ్చాత్తాపంతోనో కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని ఎస్పీ తెలిపారు. "నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించాం" అని ఎస్పీ ధీరజ్ వివరించారు.

ఈ కేసులో నిందితుడు మరణించడంతో మదనపల్లెలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత శాంతించాయి. అయితే, చిన్నారి ప్రాణాలు తీసిన నిందితుడికి ప్రకృతి సరైన శిక్షే వేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News