బొత్సకు పట్టు తప్పింది.. వైసీపీలో ఒకరికొకరు సంబంధం లేదు: అసెంబ్లీలో లోకేష్ సెటైర్లు!

Minister Nara Lokesh Chitchat in Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు.

Update: 2026-02-18 05:23 GMT

Minister Nara Lokesh Chitchat in Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణకు తన సొంత పార్టీ నేతలపై గ్రిప్ కోల్పోయారని లోకేష్ వ్యాఖ్యానించారు.

వైసీపీ ఎమ్మెల్సీలు ఒకరికొకరు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో వారు ఇచ్చిన వాయిదా తీర్మానాలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు ఒకే సమయంలో రెండు విభిన్న అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు తిరుమల లడ్డూ కల్తీపై చర్చించాలని డిమాండ్ చేయగా, మరొకరు హిందూపూర్ డైరీ అంశంపై చర్చకు పట్టుబట్టారు.

"వైసీపీ నేతల మధ్యే ఈ విషయంలో కొట్లాట జరుగుతోంది. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడటం ఆసక్తిగా ఉంది" అని లోకేష్ చమత్కరించారు. అలాగే, సభలో ప్రభుత్వం అనుసరించబోయే వ్యూహం (Strategy) ఏంటో వైసీపీ నాయకులు త్వరలోనే చూస్తారని ఆయన ఘాటుగా హెచ్చరించారు. విపక్షం ఎన్ని గందరగోళాలు సృష్టించినా, ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News