ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించిన కేంద్రం
నవంబర్ 8న విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్ మ్యాప్లో అమరావతి పేరు లేకపోవడాన్ని...
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించింది. నవంబర్ 8న విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్ మ్యాప్లో అమరావతి పేరు లేకపోవడాన్ని... టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇది ఆంధ్రుల్ని అవమానించడమేనంటూ కేంద్రాన్ని నిలదీశారు. దాంతో, ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం మరోసారి మ్యాప్ విడుదల చేసింది.