Mummidivaram: ఘనంగా వైయస్సార్ సీపీ పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం
నియోజకవర్గంలోని వైయస్సార్ సీపీ పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ముమ్మిడివరం:నియోజకవర్గంలోని వైయస్సార్ సీపీ పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.వైకాపా శ్రేణులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కార్యాలయంలో భారీ కేకును వైసీపీ శ్రేణులు సమక్షంలో ఎమ్మెల్యే కట్ చేసి పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు తినిపించారు. వైసీపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం వల్లే కార్యకర్తలకు నాయకులకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేర్కొన్నారు.కార్యక్రమంలో వైకాపా నాయకులు కాశిబాల మునికుమారి, జగత బాబ్జి, కాశి రామకృష్ణ పెనుమత్స చిట్టి రాజు, రామకృష్ణ రాజు కొలా బాబ్జి తదితరులు పాల్గొన్నారు.