NHRC చైర్మన్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

Update: 2019-10-15 13:36 GMT

ఏపీలో టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై టీడీపీ ఎంపీల బృందం NHRC చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. అక్రమ కేసులు పెట్టడంతో పాటు టీడీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు వైసీపీ పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై NHRC సానుకూలంగా స్పందించిందని టీడీపీ ఎంపీలు తెలిపారు. ఆత్మకూరు సహా రాష్ట్రంలో టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై దర్యాప్తు చేయడానికి రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపుతామని NHRC చైర్మన్ చెప్పారని టీడీపీ ఎంపీలు తెలిపారు. 

Tags:    

Similar News