22 మంది వైసీపీ ఎంపీలు సాధించింది ఏం లేదు: ఎంపీ గల్లా జయదేవ్
*కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి నిరాశే మిగిలింది: ఎంపీ గల్లా జయదేవ్ *టీడీపీ హయాంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించాం: టీడీపీ ఎంపీ
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మరో సంవత్సరం నిరాశే మిగిలిందన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తెచ్చామన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చి 22 మంది ఎంపీలను గెలిపించుకున్న వైసీపీ సాధించింది ఏం లేదని గల్లా మండిపడ్డారు.